Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : అందరి దృష్టీ విరాట్పైనే ఉంది. ఆస్ట్రేలియా-ఎతో రెండోది చివరిది అయిన అనధికార టెస్టు మ్యాచ్ కోసం భారత్-ఎ తో జట్టుకట్టిన భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రాక్టీస్లో బిజీగా గడిపాడు. భారత్-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్, పుజారాతో పాటు యువ క్రికెటర్లతో మంతనాలు జరిపాడు. ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్తో పాటు స్పిన్నర్లతో బంతులేయించుకుని చెమటలు కక్కేలా బ్యాటింగ్ చేశాడు. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ తర్వాత కోహ్లి ఇతర మ్యాచ్లు ఆడలేదు. ఆగస్టు 12 నుంచి శ్రీలంకతో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ద్వారా ఫామ్లోకి రావాలని అతడు భావిస్తున్నాడు. పైగా చెన్నై పిచ్ కూడా శ్రీలంక పిచ్లకు దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్లో ఆడాలని కోహ్లి ముందే నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా-ఎ తో మొదటి మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లి రాకతో భారత-ఎ జట్టు సభ్యుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని కోచ్ ద్రవిడ్ వెల్లడించారు. అయితే ఈ మ్యాచ్ను విరాట్ కోహ్లి ఏ మేరకు వినియోగించుకుంటాడో చూడాలి మరి !