Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం మృతి పట్ల పలువురు ప్రముఖ క్రీడాకారులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
''అబ్దుల్ కలాం...నిజమైన భారత రత్నం. ఆయన చెప్పిన స్ఫూర్తిదాయక వాక్యాల్లో 'కలలు మనల్ని నిదురపోనివ్వవు' ఇప్పటికీ నా చెవుల్లో మోగుతూనే ఉంది. ఆయన మృతి మన దేశానికి పెద్ద లోటు. ఇప్పుడు ఆయన దేశం కోసం కన్న కలల్ని నిజం చేయడానికి మనందరం కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం.
- బల్బీర్ సింగ్ (హాకీ లెజెండ్)
'మామూలు కుటుంబం నుంచి వచ్చిన కలాం దేశ ప్రథమ పౌరుడయ్యాడు. ఎంతో మంది యువతలో స్ఫూర్తి రగిల్చాడు. లక్షల మంది హృదయాల్లో స్థానం సంపాదించాడు. ఆయన నిజంగా ప్రజల రాష్ట్రపతి, అరుదైన ముత్యం లాంటి మనిషి. కలాం అంటే నాకు ఎంతో గౌరవం. ఒకసారి ఆయనను రాష్ట్రపతి భవన్లో కలుసుకున్నప్పుడు ఆయన నన్ను చూసి చాలా సంతోషించారు. అప్పుడు ఆయన... మనం అథ్లెటిక్స్లో ముందుకెందుకు వెళ్లలేకపోతున్నాం అని ప్రశ్నించారు. నేను ఆయనకు వివిధ కారణాలు వెల్లడించాను. ఆయన వాటిని ఎంతో ఆసక్తిగా విన్నారు.నిజంగా ఆయన మహా మనిషి. నేను సెల్యూట్ చేస్తున్నాను.
- మిల్కాసింగ్
'గొప్ప మేధావి, శాస్త్రజ్ఞుడు, మానవతావాది, స్ఫూర్తి ప్రదాత అయిన అబ్దుల్ కలాం మృతి దేశానికి తీరని లోటు' అని సచిన్ ట్విటర్లో వెల్లడించారు.
- సచిన్ టెండూల్కర్