Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచే ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్
- తొలిపోరులో తైజుయింగ్తో సైనా అమీతుమీ
బర్మింగ్హామ్ : భారత అగ్ర శ్రేణి షట్లర్లు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్లు ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్ టైటిల్ గురిగా బరిలో దిగనున్నారు. 17 ఏండ్ల క్రితం ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్ నెగ్గిన గోపీచంద్ శిక్షణలో రాటు దేలిన భారత స్టార్ షట్లర్లు తాజా చాంపియన్షిప్ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. గోపీచంద్ (2001) కాకుండా భారత్ తరఫున ప్రకాశ్ పదుకొనే (1980) ఒక్కరే ఆల్ ఇంగ్లాండ్ విజేతలుగా నిలిచారు. తాజా ఈవెంట్లో కిదాంబి శ్రీకాంత్, పివి సింధులకు సులువైన తొలి రౌండ్ డ్రా లభించింది. కానీ ఆల్ ఇంగ్లాండ్ మాజీ ఫైనలిస్ట్, హైదరాబాదీ అమ్మాయి సైనా నెహ్వాల్కు మాత్రం ఆదిలోనే కఠిన పోరు కాచుకున్నది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నెంబర్వన్ తైజుయింగ్ (తైవాన్)ను సైనా ఎదుర్కోనున్నది.
సైనాపై గెలుపోటముల రికార్డులో 9-5తో తైజుయింగ్దే పైచేయి. నాల్గో సీడ్ సింధు తారు షట్లర్ పోర్న్పావీ చొచువాంగ్తో తొలి మ్యాచ్లో తలపడనుండగా..తదుపరి రౌండ్లో ఇండియా ఓపెన్ విజేత బెవాన్ జంగ్ను ఢ కొంటుంది. శ్రీకాంత్ తొలి పోరులో బ్రైస్ లెవర్డెజ్ (ఫ్రాన్స్)ను ఎదుర్కోనున్నాడు. సాయి ప్రణీత్, హెచ్ఎస్ ప్రణరులు బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్లో పొన్నప్ప జోడీపై, మిక్స్డ్లో సిక్కిరెడ్డి జోడీపై భారత్ ఆశలు పెట్టుకున్నది.