Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెస్ట్ ఆఫ్ ఇండియాతో ఇరానీ కప్ పోరు
నాగ్పూర్: తొలిసారి రంజీ విజేతగా అవత రించిన విదర్భ జట్టు ఇరానీ కప్లో దూసుకుపో తున్నది. వసీమ్ జాఫర్ (113 బ్యాటింగ్, 166బంతుల్లో 16ఫోర్లు, 1సిక్స్) అజేయ శతకంతో చెలరేగాడు.
ఓపెనర్లు ఫైజ్ ఫజల్ (89), సంజరు రామస్వామి(53) హాఫ్ సెంచరీ లతో రాణించటంతో రెస్ట్ ఆఫ్ ఇండియాతో పోరులో తొలిఇన్నింగ్స్లో విదర్భ రెండు వికెట్ల నష్టానికి 289 పరుగులతో కొనసాగుతోంది. తొలి రోజు ఆటముగిసే సమయానికి గణేశ్సతీష్ (29బ్యాటింగ్) క్రీజులో కొనసాగుతు న్నాడు. రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్లు చెరో వికెట్ తీసుకున్నారు.