Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పేసర్ మహమ్మద్ షమి ఎదుర్కొంటున్న ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ చేపట్టాలని సుప్రీం నియమిత పాలకుల కమిటీ (సీఓఏ).. బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ (ఏసీయూ)కు ఆదేశాలిచ్చింది. దుబారులో ఓ మహిళ నుంచి డబ్బు తీసుకున్న షమి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఆయన భార్య హసీన్ జహాన్ ఆరోపణలు చేసిన సంగతి విదితమే. దానికి ఆధారంగా చూపుతూ.. షమి మాట్లాడిన ఓ వీడియో ను సైతం ఆమె సోషల్ మీడిలో బయటపెట్టారు. ఈ నేపథ్యం లో షమిపై విచారణ చేపట్టాలని సీవోఏ నిర్ణయంచింది. ఏసీయూ ఉన్నతాధికారి నీరజ్కుమార్ దీనిపై సమగ్ర విచారణ జరిపి వారంలోగా నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసి నట్టు సమాచారం. భార్య హసీన్ చేసిన ఆరోపణల కారణంగా ఇప్పటికే షమి బీసీసీఐ కాంట్రాక్టు పోగొట్టుకున్నాడు. కోల్కతా లో అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.