Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆండర్సన్, డెల్ పొట్రో కూడా
- ప్లిస్కోవాకు నిరాశ
- ఇండియన్ వెల్స్ మాస్టర్స్
ఇండియన్వెల్స్ (అమెరికా) : స్విస్ దిగ్గజం, ప్రపంచ నెంబర్ వన్ రోజర్ ఫెడరర్ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీ క్వార్టర్స్లో ప్రవేశించాడు. మహిళల టాప్ సీడ్ సిమోన హాలెప్ సెమీస్లో కాలుమోపింది. చెక్ చిన్నది కరొలినా ప్లిస్కోవా (ఐదో సీడ్)కు క్వార్టర్స్లో నిరాశ ఎదురైంది. అన్సీడెడ్ నయోమి ఒసాకా (జపాన్) చేతిలో 2-6, 3-6తో ఘోర పరాజయం చవి చూసింది.
వయసు మీద పడే కొద్దీ ఆటలో పదును పెంచుతోన్న ఫెడరర్.. ఫ్రాన్స్ ఆటగాడు జెరెమీ చార్డీను గురవారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో 7-5, 6-4తో ఓడించాడు. రెండు సెట్లనూ బ్రేక్ తర్వాతే నెగ్గిన ఫెడరర్.. పోరును 82 నిమిషాల్లో ముగించాడు. తదుపరి రౌండ్లో కొరియా యువ సంచలనం చంగ్ హ్యూన్తో తలపడనున్నాడు. ఆండర్సన్, డెల్ పొట్రోలు చెమటోడ్చి క్వార్టర్స్లో చోటు దక్కించుకున్నారు. ఆల్ అర్జెంటీనా ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో ఆరో సీడ్ డెల్ పొట్రో 3-6, 7(70-6920, 6-3తో సహచర ఆటగాడు లియోనార్డో మేయర్పై గెలిచాడు. ఏడో సీడ్ కెవిన్ ఆండర్సన్ (దక్షిణాఫ్రికా) 4-6, 6-3, 7(8)-6(6)తో 11వ సీడ్ స్పెయిన్ ప్లేయర్ కారెనో బుస్టాను ఓడించాడు. మహిళల సింగిల్స్లో సిమోన హాలెప్ సైతం అన్ సీడెడ్ పెట్రా మార్టిచ్ (క్రొయేషియా)ను ఓడించడానికి కష్టపడింది. మూడు సెట్ల పోరులో 6-4, 6(5)-7970, 6-3తో గెలుపొందింది.