Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి
వదోదర : భారత మహిళల జట్టుతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ 2-0తో ఆసీస్ సొంతమైంది. గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ కోల్పోయింది. టాస్ నెగ్గిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఆసీస్కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వన్డేలో శతక్కొట్టిన ఓపెనర్ బోల్టన్ (84, 88 బంతుల్లో 12 ఫోర్లు) సహా ఎలైస్ పెర్రి(70 నాటౌట్), బెత్ మూనీ(56)లు రాణించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. భారత బౌలర్ శిఖా పాండేకు మూడు, పూనమ్ యాదవ్కు రెండు వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ తడబడింది. 88 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్ ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఓపెనర్ స్మ తి మంధాన(67) తప్ప మిగతా బ్యాట్స్వుమెన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. జట్టులోకి తిరిగొచ్చిన మిథాలీ రాజ్(15) సైతం ఆకట్టుకోలేదు. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ మరో నాల్గు బంతులుండగానే 227 పరుగులకే కుప్పకూలింది. దీంతో 60 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ దక్కించుకున్నది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును బోల్టన్ అందుకుంది. సిరీస్లో నామమాత్రమైన ఆఖరు వన్డే ఆదివారం జరగనున్నది.