Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్లో నిచటాన్పై 2-1తో విజయం
- ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
బర్మింగ్హామ్ : తెలుగు తేజం పివి సింధు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. అయితే తొలి పోరులాగానే సింధు ప్రీ క్వార్టర్స్లోనూ కష్ట పడింది. నాల్గో సీడ్ సింధు అన్సీడెడ్ క్రీడాకారిణితో మూడు సెట్ల పాటు పోరాడింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్ పోరులో 21-13, 13-21, 21-18తో తారులాండ్ చిన్నది నిచటాన్ జిందాపోల్పై గెలుపొందింది.
హోరాహోరీగా సాగిన పోరులో సింధు స్వల్ప తేడాతో క్వార్టర్స్లో స్థానం సంపాందించింది. భారీ ర్యాలీలతో గంటకు పైగా సాగిన మ్యాచ్లో ప్రత్యర్థి కంటే ఓవరాల్గా కేవలం మూడే పాయంట్లతో గెలుపొందింది. తొలిసెట్ను 1-0తో ఆరంభించిన సింధు 1-1, 3-3తో నిచటాన్కు అవకాశం ఇచ్చినా ఆపై ఆధిక్యం పెంచుకుంటూ పోయింది. 3-3 స్కోరున్న వేళ వరుసగా ఆరు పాయింట్లు సాధించి 9-3తో ముందంజ వేసింది. ఆపై అదే జోరు కొనసాగిస్తూ 21-13తో తొలి సెట్ సొంతం చేసుకున్నది. రెండో సెట్నూ 1-0 ఆధిక్యంతోనే ఆరంభించిన సింధు కాసేపు తడబడింది. 2-2 వరకూ పోటీలో నిలిచినా ఆపై ప్రత్యర్థి వేగాన్ని అందుకోలేదు. 1-12తో ఉన్న పాయింట్ల అంతరాన్ని తగ్గిస్తూ 13-17తో పోటీలోకొచ్చే ప్రయత్నం చేసినా మరోసారి చెలరేగిన నిచటాన్కు 13-21తో సెట్ కోల్పోయింది. చెరో సెట్ నెగ్గటంతో నిర్ణాయక మూడో సెట్ హోరాహోరీగా సాగింది. 3-0తో మొదలెట్టిన సింధు 8-4తో దూసుకెళ్లినా 9-9, 12-12, 18-18తో స్కోరు సమం అవుతూ వచ్చింది. ఈ దశలో నేర్పుగా ప్రత్యర్థిని కట్టడి చేసిన సింధు మరో పాయింట్ కోల్పోలేదు. 21-18తో సెట్ నెగ్గి క్వార్టర్స్ స్థానాన్ని గెల్చుకుంది.