Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కౌలాలంపూర్ : ప్రపంచ కప్, కామన్వెల్త్.. ఇప్పుడు యూనివర్శిటీ పోటీలు. స్థాయి ఏదైనా, పోటీ ఎక్కడైనా మన షూటర్ల గురి తప్పడం లేదు. తాజాగా కౌలాలంపూర్లో జరుగుతున్న యూనివర్శీటీ షూటింగ్ పోటీల్లో భారత్కు స్వర్ణ పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో అన్మోల్ జైన్, అచల్ ప్రతాప్ సింగ్, నిశాంత్ సింగ్లతో కూడిన పురుషుల జట్టు గోల్డ్ కొల్లగొట్టింది. ఫైనల్లో 1725 పాయింట్లు సాధించిన యువ త్రయం పసిడి పట్టేశారు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు మేఘన సజ్జనర్, ఎలావినిల్లు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
కామన్వెల్త్ క్రీడలను బహిష్కరించాలి : 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి షూటింగ్ను ఐచ్ఛిక క్రీడగా చేయటంపై భారత వెటరన్ షూటర్ జస్పాల్ రానా మండిపడ్డాడు. ఇప్పటికే ఆసియా గేమ్స్లో షూటింగ్లో సుమారు 25 క్రీడాంశాలను తొలగించారు. షూటింగ్ను ఐచ్ఛికం చేస్తూ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ' షూటింగ్ను తొలగించటంపై ప్రభుత్వం పోరాటం చేయాలి. మనకు ఎక్కువ పతకాలు వచ్చే క్రీడలను తొలగించటం పట్ల తీవ్రంగా స్పందించాలి. కామన్వెల్త్ క్రీడలను బహిష్కరించాలి, అక్కడ మన గన్ పేలొద్దు. చైనా నాల్గు ఒలింపిక్స్ క్రీడలను బహిష్కరించింది, తర్వాత వచ్చి మొత్తం పతకాలు కొల్లగొట్టింది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలి' అని రానా పేర్కొన్నాడు.