Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్లో పోరాడిన ఓడిన తెలుగు తేజం
- 2-1తో యయగూచి ముందంజ
- ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్
నవతెలంగాణ-బర్మింగ్హామ్
ఆల్ ఇంగ్లాండ్లో భారత ఆశలు ఆవిరయ్యాయి. పతకం తెస్తుందని ఆశలు పెట్టుకున్న పి.వి సింధు పోరాటానికి సెమీఫైనల్లోనే తెరపడింది. రెండో సీడ్ అకానె యమగూచి (జపాన్)తో మూడు గేముల పోరులో హోరాహోరీగా పోరాడిన సింధు 21-19, 19-21, 18-21తో ఓటమిపాలైంది. గంటన్నర పాటు సాగిన సెమీ సమరంలో సింధు ఆరంభంలో ముందంజలో నిలిచినా.. ఆఖర్లో ఆధిక్యం నిలుపుకోలేదు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తొలిసారి సెమీస్కు చేరుకున్న సింధు.. మరో అడుగు ముందుకేయలేదు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్లో హెచ్.ఎస్ ప్రణరు పోరాడి ఓడాడు. చైనా షట్లర్ చేతిలో 2-20, 16-21, 21-23తో మూడు గేముల్లో తలొగ్గాడు. తొలుత ప్రణరు, తర్వాత సింధు నిష్క్రమణతో బర్మింగ్హామ్లో భారత పతక వేటకు తెరపడింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ తారు జుయింగ్ (చైనీస్ తైపీ)తో అకానె యమగూచి తలపడనున్నది.
ముందు జోరు, ఆఖర్లో డీలా :
సెమీఫైనల్లో సింధుకు అద్భుత ఆరంభం లభించింది. తొలి గేమ్లో 7-2తో ఐదు పాయింట్ల ఆధిక్యంతో జోరు మొదలెట్టిన సింధు.. విరామ సమాయనికి 11-6తో ఆధిక్యం నిలుపుకున్నది. ద్వితీయార్థంలో యమగూచి ప్రతిఘటించింది.10-17 నుంచి 15-17తో పాయింట్ల అంతరాన్ని తగ్గించింది. యమగూచి వరుస పాయింట్లతో ఉత్కంఠ రేకెత్తినా.. సింధు 20-18తో ముందుకెళ్లింది. 21-19తో తొలి గేమ్ సొంతం చేసుకున్నది. రెండో గేమ్ ఆరంభంలోనూ సింధుకు ఎదురులేదు. కానీ 7-9, 9-11తో విరామ సమయానికి యమగూచికి ఆధిక్యం కోల్పోయింది. సెకండ్ హాఫ్లో సింధు పోరాడినా పాయింట్ల అంతరం తగ్గలేదు. 14-17, 17-19, 18-19తో వెనకంజలోనే కొనసాగింది. 21-19తో రెండో గేమ్ నెగ్గిన యమగూచి మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో గేమ్కు తీసుకెళ్లింది. ఫైనల్స్ బెర్త్ను నిర్ణయించే గేమ్లో సింధు దూకుడుగా ఆడింది. 7-4, 9-7, 11-7తో దూసుకెళ్లింది. కానీ ద్వితీయార్థంలో సింధు లయ తప్పింది. యమగూచి వరుస పాయింట్లతో దూసుకొచ్చింది. 14-14తో సమవుజ్జీగా నిలిచి రేసును రక్తి కట్టించింది. 16-16, 17-17, 18-18తో ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠ రేపిన తరుణంలో సింధు తడబడింది. యమగూచికి వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి ఫైనల్స్ బెర్త్ను చేజార్చుకున్నది.