Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోనిపై కోహ్లి అభిప్రాయమిదే
- పాలకుల కమిటీ చైర్మెన్ వినోద్ రారు
ముంబయి : సహజంగా జట్టులో ఇద్దరు అగ్రశ్రేణి, స్టార్ ఆటగాళ్లు ఉన్నవేళ రెండు అధికార కేంద్రాలు లేదా గ్రూపులు ఉండటం సహజమే. జట్టు నాయకుడిగా తిరుగులేని విజయాలకు తోడు సుదీర్ఘ కాలం కెప్టెన్గా కొనసాగిన ఆటగాడు జట్టులో ఉంటే.. అతడితో ప్రస్తుత సారథికి కాస్త ఇబ్బందికర పరిస్థితే!. భారత క్రికెట్ ఇటువంటి పరిణామాలను గతంలో ఎన్నోసార్లు చవిచూసింది. కానీ ప్రస్తుత టీమ్ ఇండియా డ్రెస్సింగ్రూమ్ పరిస్థితి ఇందుకు ఎంతో భిన్నం. దిగ్గజ సారథి ఎం.ఎస్ ధోనితో యువ నాయకుడు విరాట్ కోహ్లి స్నేహబంధం అనిర్వచనీయం. ధోని బంధాన్ని ఎవ్వరూ చెరపలేరని గతంలో స్వయంగా కోహ్లియే సెలవిచ్చాడు. తాజాగా పాలకుల కమిటీ చైర్మెన్ వినోద్ రారు అదే విషయాన్ని వెల్లడించారు. ధోని, కోహ్లి బంధం ఎంతో గొప్పదని, వారిద్దరి మధ్య అభిప్రాయలు పంచుకునే విధానం సైతం ఎంతో ఉన్నతమైనదని రారు తెలిపారు. ధోనిపై కోహ్లి తనతో పంచుకున్న అభిప్రాయాలను రారు వెల్లడించాడు. ' ధోని, కోహ్లి స్నేహం ఎంతో ఉన్నతమైనది. ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ఎంతో గౌరవంతో ఉంటారు. ధోని క్రికెటింగ్ నైపుణ్యంపై కోహ్లి గౌరవం ఉండగా.. ఆటగాడిగా విరాట్ ఘనతలపై ధోనికి గౌరవం ఉంది' అని రారు తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎం.ఎస్ ధోని ఎందుకు విలువైన ఆటగాడో కోహ్లి నాతో చెప్పాడు. వికెట్ల వెనకాల ధోనికి మించిన వేగంతో మరొకరు లేరు, అతడి క్రికెటింగ్ బుర్ర జట్టుకు ఎంతో ఉపయుక్తం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎం.ఎస్ ధోని స్థానం భర్తీచేయలేనిదని కోహ్లి చెప్పాడని రారు అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత కోహ్లి, ధోనిలు ఇద్దరూ విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం శ్రీలంకలో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్లో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లేకుండా టీమ్ ఇండియా అక్కడికి వెళ్లింది. ధోని, కోహ్లి తిరిగి ఐపీఎల్లోనే మళ్లీ మైదానంలో కనువిందు చేయనున్నారు.