Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ్పూర్ : మూడు మాసాల క్రితం తొలిసారి రంజీ విజేతగా నిలిచిన విదర్భ... అక్కడితో ఆగిపోలేదు. రెస్టాఫ్ ఇండియాను ఓడించి తొలిసారి ఇరానీ కప్ను సైతం సొంతం చేసుకున్నది. వసీం జాఫర్ (286), వాంఖడే (157), గణేశ్ (120)లకు తోడు పేసర్ రజ్నీష్ గుర్బానీ (4/70) రాణించటంతో తొలి ఇన్నింగ్స్లో 800/7 భారీ స్కోరు సాధిచిన విదర్భ.. రెస్టాఫ్ ఇండియాను 390 పరుగులకే కుప్పకూల్చింది. రెండో ఇన్నింగ్స్లో 79/0తో వికెట్ కోల్పోని విదర్భ.. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇరానీ కప్ దక్కించుకున్నది. భారీ డబుల్ సెంచరీ బాదిన వసీం జాఫర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.