Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో వన్డేలోనూ తప్పని ఓటమి
- 0-3తో ఆసీస్ చేతిలో వైట్వాష్
వడోదర : విదేశీ గడ్డపై గొప్ప విజయాలు సాధించిన ఊపుమీదున్న మిథాలీరాజ్ సేన.. ఆశ్చర్యకరంగా స్వదేశంలో చతికిల పడింది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ను టీమ్ ఇండియా అమ్మాయిలు వైట్వాష్ ఓటమితో కోల్పోయారు. వడోదరలో జరిగిన మూడో వన్డేలోనూ ఆస్ట్రేలియా అమ్మాయిలు విజయం సాధించి సిరీస్ను క్లీన్స్వీప్ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 332/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అలిసీ హీలే (133, 115 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్లు) శతకంతోత చెలరేగింది. భారీ ఛేదనలో టీమ్ ఇండియా 235 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు రొడ్రిగస్ (42), స్మృతి మంధాన (52) రాణించినా.. తర్వాత ఎవ్వరూ క్రీజులో నిలబడలేదు. కెప్టెన్ మిథాలీరాజ్ (21), హర్మన్ప్రీత్ కౌర్ (25) నిరాశపరిచారు. ఇక ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు పాల్గొంటున్న ముక్కోణపు టీ20 సిరీస్ ముంబయిలో ఈ నెల 22 నుంచి ఆరంభం కానున్నది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా అమ్మాయిలు తలపడనున్నారు.