Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్తో వన్డే వేదిక మార్పుపై ఎంపీ శశి థరూర్ విమర్శ
న్యూఢిల్లీ : ఈ ఏడాది నవంబర్లో వెస్టిండీస్తో జరగాల్సిన వన్డే మ్యాచ్ వేదిక విషయంపై తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కోచి నెహ్రూ స్టేడియం ప్రస్తుతం ఫుట్బాల్ మ్యాచులకు కేంద్రం కాగా.. ఇప్పుడు తిరువనంతపురం నుంచి వన్డే మ్యాచ్ను కోచికి తరలించటం వెనుక ఎవరికి లాభం? అని అంటూ ప్రశ్నించాడు. దీనిపై పాలకుల కమిటీ చైర్మెన్ వినోద్ రారుకి ఫిర్యాదు చేశారు. వినోద్ రారు ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తానని హామీ ఇచ్చారు. కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని థరూర్ ఆరోపించారు. ఇక కోచిలో ఎంతో వ్యయప్రయాసలతో ఫుట్బాల్ టర్ఫ్ సమకూర్చితే.. ఇప్పుడు క్రికెట్ కోసం పిచ్ను తవ్వుతారా? అంటూ కేరళ బ్లాస్టర్స్ ఎఫీసీ సభ్యుడు కె వినీత్ ట్విట్టర్లో ఆవేదన వ్యకం చేశాడు.