Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని టీ20 ఫార్మాట్లో నిర్వహించేందుకు బీసీసీఐ అనుకూలంగా లేదని ఐసీసీ వర్గాల సమాచారం. చాంపియన్స్ ట్రోఫీని మరింత లాభదాయక టోర్నీగా మార్చేందుకు 50 ఓవర్ల నుంచి 20 ఓవర్ల ఫార్మాట్కు మార్చాలని ఐసీసీ ప్రతిపాదనగా తెలుస్తోంది. 2021లో చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వాల్సిన బీసీసీఐ అందుకు అంగీకారం తెలపటం లేదట!. క్రికెట్ పాలకుడు జగన్మోహన్ దాల్మియా ప్రవేశపెట్టిన టోర్నీలో మార్పులకు అంగీకరించే ప్రసక్తే లేదని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఇక ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులు దక్కని పక్షంలో టోర్నీ వేదికను మార్చేందుకు వెనుకాడ బోమని ఐసీసీ స్పష్టీకరిస్తోంది. గతంలో జరిగిన ఐసీసీ టోర్నీలకే ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు దక్కని సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలాఖరులో కోల్కతలో జరుగనున్న ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ అం
శంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.