Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రియోలో భారత క్రీడా మంత్రి విజరు గోయెల్ సహా ఇతర అధికారులు తమ ప్రవర్తనతో పరువు తీశారు. అథ్లెట్ల కంటే అధికార బృందమే రియోకు అధిక సంఖ్యలో వెళ్లారు. అథ్లెట్లు ఎకానమీ తరగతిలో ప్రయాణించగా, అధికారులు బిజినెస్ క్లాస్లో రియోకు చేరారు. ఏప్రిల్ 4 నుంచి కామన్వెల్త్ గేమ్స్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత బృందంపై మరోసారి చర్చ సాగుతోంది. 222 మంది అథ్లెట్లతో పాటు 106 మంది అధికారులు వెళ్తున్నారు. వీరిలో 57 మంది కోచ్లు, 19 మంది వైద్యులు, ఫిజియోలు, ఏడుగురు మేనేజర్లు కాగా 41 మంది అదనపు అధికారులున్నారు. రియోలో కనీస నిబంధనలు పాటించని కారణంగా భారత క్రీడా మంత్రి గోయెల్ గుర్తింపు కార్డు రద్దు చేస్తామని నిర్వాహకులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ఒలింపిక్ సంఘం జంబో అధికార బృందాన్ని ఆస్ట్రేలియాకు పంపుతోండగా.. అక్కడేం జరుగుతుందో చూడాలి!.