Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో వైట్వాష్కు గురైన టీమ్ ఇండియా అమ్మాయిల జట్టు.. నేటి నుంచి మరో సవాల్కు సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లతో హర్మన్ప్రీత్ కౌర్సేన టీ20 ట్రై సిరీస్లో తలపడబోతుంది. ముంబయిలో నేడు జరుగనున్న తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా ఢకొీట్టనున్నది. దక్షిణాఫ్రికాను పొట్టి ఫార్మాట్లో ఓడించిన మనోళ్లు.. అదే జోరు ఇక్కడా కొనసాగించాలని చూస్తున్నారు. సఫారీ పర్యటనలో గాయానికి గురైన సీనియర్ పేసర్ జులన్ గోస్వామి ముక్కోణపు టోర్నీకి ఫిట్నెస్ సాధించింది. నేటి మ్యాచ్లో గోస్వామి బంతి అందుకోనున్నది. ఇక స్పిన్నర్ ఏక్తా బిస్త్కు సైతం సెలక్టర్లు మళ్లీ పిలుపునందించారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఓటమితో పాఠాలు నేర్చుకున్న అమ్మాయిలు.. ముక్కోణంలో మెరువాలనే తపనతో ఉన్నారు. నేడు ఆస్ట్రేలియా, భారత్ తొలి టీ20 పోరు ఉదయం 10 గంటలకు ఆరంభం కానున్నది.