Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్పై ఆసీస్ గెలుపు
- మహిళల ముక్కోణపు టీ20
ముంబయి : లయ తప్పిన టీమ్ ఇండియా అమ్మాయిలు.. మళ్లీ గెలుపు ట్రాక్ పైకి వచ్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు!. ఫార్మాట్ మారినా ఫలితంలో మార్పు కనిపించటం లేదు. 0-3తో వన్డే సిరీస్ను కోల్పోయిన అమ్మాయిల జట్టు తాజాగా ముక్కోణపు టీ20 టోర్నీ తొలి మ్యాచ్లోనూ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యారు. ఓపెనర్ స్మృతి మంధాన (67, 41 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్) అర్ధ సెంచరీతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 152/5 పరుగులు చేసింది. ఛేదనలో మూనీ (45), విలనీ (39), లానింగ్ (35) రాణించటంతో 18.1 ఓవర్లలోనే ఆస్ట్రేలియా పని పూర్తి చేసింది. నేడు జరిగే మరో మ్యాచ్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లు తలపడనున్నాయి.