Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత ఒలింపిక్ సంఘం డిమాండ్
న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్ మాదిరిగానే గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడలకూ అవసరం లేని అధికార గణంతో వెళ్లేందుకు ఒలింపిక్ సంఘం రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఐఓఏ అధ్యక్షుడు నరెందర్ బాత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అర్హత లేని 41 మంది అధికారులకు క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అథ్లెట్లకు వీడ్కోలు పలుకుతూ ఈ అంశంపై బాత్రా స్పందించాడు. ' సింధు, సైనా కుటుంబసభ్యులు గోల్డ్కోస్ట్కు వెళ్లకుండా క్రీడా శాఖ ఎందుకు అడ్డుకుంటుందో అర్ధం కావటం లేదు. ప్రభుత్వం వారి ఖర్చులు భరించనప్పుడు వారికెందుకు అభ్యంతరం. సచిన్, విరాట్ విషయంలో క్రీడా శాఖ ఇలాగే చేస్తుందా? మరి సింధు, సైనా విషయంలో ఎందుకు ఈ వైఖరి?' అని బాత్రా అన్నాడు. ఇక అధికార బృందంలో భాగంగా కామన్వెల్త్ గేమ్స్కు వెళ్తున్నామనే వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సింధు, సైనా తల్లిదండ్రులు వివరణ ఇచ్చారు. రియో ఒలింపిక్స్ అయినా, మరే ఇతర టోర్నీ అయినా సొంత ఖర్చులతోనే వెళ్తున్నామని సింధు తండ్రి రమణ, సైనా నాన్న హర్వీర్ సింగ్ తెలిపారు. సింధు తల్లి విజయ, సైనా తండ్రి హర్వీర్లు అధికారుల బృందంలో భాగంగా వెళ్తున్నారనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.