Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటన అత్యంత కీలకమని, అందుకే ఇంగ్లీష్ టూర్కు కాస్త ముందు నుంచే సన్నద్ధమవుతామని టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న శిఖర్ ధావన్ బీసీసీఐ కేంద్ర కాంట్రాక్టులో ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. ' ఇంగ్లాండ్ పర్యటన ఎంతో క్లిష్టమైనది. అక్కడి పిచ్లపై నిలువాలంటే.. ఎంతో ముందుగానే సన్నద్ధం కావాలి. సరైన సన్నద్ధత ఉంటే మెరుగైన షాట్లు ఆడేందుకు వీలుంటుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో నా ప్రదర్శన కాంట్రాక్టులో ఏ ప్లస్ విభాగంలో చేరేందుకు దోహదం చేసింది' అని ధావన్ అభిప్రాయపడ్డాడు.