Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మియామీ : భారత టెన్నిస్ సంచలనం యూకీ బాంబ్రీ జోరు కొనసాగుతోంది. ఇటీవల ఇండియన్ వెల్స్లో మూడో రౌండ్ వరకూ వెళ్లిన బాంబ్రీ అదే జోరు మియామీలోనూ చూపిస్తున్నాడు. అర్హత రౌండ్లలో అబ్బురపరిచిన బాంబ్రీ.. వరల్డ్ నం.75 మీర్జా బాసిక్పై 7-5, 6-3తో వరుస సెట్లలో గెలుపొందాడు. 92 నిమిషాల తొలి రౌండ్ పోరులో తన కంటే మెరుగైన ఆటగాడిని ఓడించిన బాంబ్రీ.. తర్వాతి మ్యాచ్లో వరల్డ్ నం.11, ఎనిమిదో సీడ్ జాక్ సాక్ (అమెరికా)తో తలపడనున్నాడు.