Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్లో దక్షిణాఫ్రికా 72 రోజుల పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా 2018లో భారత్కు ఆ దేశంలో ఒక సుదీర్ఘ పర్యటన ఉండబోతున్నట్లు సమాచారం. మొత్తానికి రెండు క్రికెట్ బోర్డుల మధ్య సత్సంబంధాల వల్ల రెండు దేశాల మధ్య కూడా స్నేహసంబంధాలు విరియబోతున్నాయి. దీనిపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సిఇవొ హరూన్ లోర్గాత్ మాట్లాడుతూ 'మేం బిసిసిఐతో సంబంధాలు మెరుగుపరుచుకున్నాం. అయితే వ్యక్తులు, సంస్థల కన్నా ఆటే గొప్పది' అని ఆయన వెల్లడించారు.