Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్రోణాచార్యకు ద్రవిడ్ : బీసీసీఐ సిఫారసు
ముంబయి: భారత్ పించ్ హిట్టర్ విరాట్ కోహ్లీ పేరును ఖేల్రత్న అవార్డుకు బీసీసీఐ ప్రతిపాదించింది. ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుకు సిఫారసు చేసినట్టు బీసీసీఐ సీవోఏ చీఫ్ వినోద్ రారు ధ్రువీకరించారు. విరాట్ కోహ్లీతో పాటు భారత అండర్-19 క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మాజీ క్రికెటర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరును ద్రోణాచార్య, మరో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ను ధ్యాన్చంద్ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపినట్టు రారు తెలిపారు.
'ఖేల్రత్న కోసం బీసీసీఐ కోహ్లీ పేరు పంపడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాదీ ఈ అవార్డు కోసం కోహ్లీ పేరు పంపారు.కానీ అప్పుడు రియో ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మలిక్, తృటిలో పతకం కోల్పోయిన దీప కర్మాకర్కు అందించారు. అందుకే ఈసారి కోహ్లీ పేరును పంపించామని రారు వివరించారు. టె స్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీ ఈ మూడు ఫార్మాట్లలోనూ ఈరగదీస్తున్నాడు. జట్టు విజయాల్లో నూ కీలకపాత్ర పోషిస్తూ ... ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ మరికొన్ని రికార్డులకు చేరువయ్యాడు.
భారత అండర్-19 క్రికెట్ జట్టు ఈ ఏడాది ప్రపంచ కప్ సాధించడంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్ పేరును ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. ఇండియా-ఎ జట్టుకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే మాజీ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పేరును బీసీసీఐ ధ్యాన్చంద్ అవార్డుకు సిఫారసు చేసింది.