Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్పై ఘన విజయం
- లో స్కోర్..మరో థ్రిల్లింగ్ మ్యాచ్
హైదరాబాద్: బౌలింగే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగిన సన్రైజర్స్ అనుహ్య విజయాన్ని ఖాతాలో వేసుకున్నది. రషీద్ ఖాన్ (3/19), షకిబ్ అల్ హసన్ (2/18) స్పిన్ బౌలింగ్తో మాయ చేశారు. దీంతో 13పరుగుల తేడాతో సన్రైజ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నది. సన్రైజర్స్ బౌలర్ల ధాటికి పంజాబ్ డీలాపడిపోయింది. 19.2ఓవర్లలో 119పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. టాస్ గెలిచినా ఓటమి పాలుకావటంతో..పంజాబ్ టీమ్ సభ్యులంతా షాక్కు గురయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ను మనీశ్ పాండే (51బంతులో 54 పరుగులు ) ఆదుకున్నాడు. షకిబ్ అల్ హసన్ (29 బంతుల్లో 28 పరుగులు) తో కలిసి జట్టుకు కాపాడుకోదగ్గ స్కోరును చేశారు. ఊహించని విధంగా పంజాబ్ బౌలర్లలో రాజ్పుత్ చెలరేగి పోయారు. ఏకంగా ఐదు వికెట్లు తీయడంతో సన్రైజర్స్ 132పరుగులు మాత్రమే చేసింది.తక్కువ స్కోరు కదా..పంజాబ్ ఈజీగా ఛేజ్ చేయగలదని ఆ టీమ్ సభ్యులు,క్రీడాభిమానులు అనుకున్నారు. కానీ సన్ రైజ్ హైదరాబాద్ బౌలర్లు కుమ్మేశారు. కసిగా బౌలింగ్ చేసి,పంజాబ్ బ్యాట్మెన్లను పెవిలియన్ వైపు దారిపట్టించారు. ఇప్పటి దాకా వరుస విజయాలతో జోరుమీదున్న పంజాబ్ జట్టు తొలిసారి సన్రైజ్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది.
తడబడి..తక్కువస్కోరుకే
సొంతగడ్డపై సన్రైజర్స్ బ్యాట్స్మెన్స్ తడబడ్డారు. దీంతో తక్కువస్కోరుకే ఆ జట్టు పరిమితమైంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ను పంజాబ్ బౌలర్ రాజ్పుత్(5/14) దెబ్బతీశాడు. మిగతా బౌలర్లు కూడా లైన్ అండ్ లెన్త్తో.. కట్టుదిట్టంగా బంతులు విసరడంవైపే దృష్టిపెట్టారు. ఇదే హైదరాబాద్ బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందికరంగా మారింది. ఎంతప్రయత్నించినా పరుగులు సాధించలేకపోవటంతో.. నిర్ణీత 20ఓవర్లలో సన్రైజర్స్ ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.