Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ స్వతంత్ర చైర్మెన్గా ఏకగ్రీవం
- 2020 వరకూ పదవీ కాలం
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ప్రపంచ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్వతంత్య్ర చైర్మెన్గా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2016లో బీసీసీఐ అధ్యక్ష పదవి వదులుకుని ఐసీసీ పగ్గాలు చేపట్టిన శశాంక్ మనోహర్.. ప్రపంచ క్రికెట్లో విప్లవాత్మక సంస్కరణలు అమలు పరిచాడు. ఐసీసీ డైరెక్టర్లు అందరూ శశాంక్ మనోహరే అభ్యర్థిత్వాన్నే బలపరచగా.. వరుసగా రెండోసారి శశాంక్ ఐసీసీ చైర్మెన్్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2020 వరకూ మనోహర్ చైర్మెన్ పదవిలో కొనసాగనున్నాడు. నిజానికి చైర్మెన్్ ఎన్నిక ప్రక్రియ జూన్ సమావేశాల్లో నిర్వహిస్తారు. కానీ చైర్మెన్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ రావటంతో ఓటింగ్ అవసరం లేకుండానే మనోహర్ ఎన్నికయ్యాడు. ఐసీసీ ఎన్నికల పర్యవేక్షకుడు ఎడ్వర్డ్ క్విన్లిన్ ఈ మేరకు శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మెన్గా ఎకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించాడు.
వద్దు వద్దంటూనే! : ఐసీసీ చైర్మెన్ పదవి వద్దు వద్దు అంటూనే శశాంక్ మనోహర్ మరో రెండేండ్లు కొనసాగేందుకు సిద్ధమయ్యాడు. 2016లో బీసీసీఐ పీఠం కాదనుకుని ఐసీసీకి వచ్చిన మనోహర్.. ఆరు మాసాల క్రితం వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేశారు. కానీ ఐసీసీ బోర్డు సభ్యుల అభ్యర్థన మేరకు రాజీనామాను వెనక్కి తీసుకు న్నారు. కానీ ఐసీసీలో చేపట్టిన కీలక సంస్కరణలు పూర్తి కాకముందే చైర్మెన్్గా తప్పుకోవటం మంచి ఆలోచన కాద ని సభ్యులు సూచించటంతో, మనోహర్ మనసు మార్చు కుని కొనసాగేందుకు అంగీకరించాడు. బోర్డు డైరెక్టర్ల సూచన మేరకు ఈ ఏడాది జూన్ వరకూ కొనసాగతానని తొలుత చెప్పిన మనోహర్.. మరో రెండేండ్లు పదవిలో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.
కీలక సంస్కరణలు : ఐసీసీ స్వతంత్య్ర చైర్మన్గా శశాంక్ మనోహర్ విజయవంతమయ్యాడనే చెప్పవచ్చు. ఐసీసీ పరిపాలన రాజ్యాంగంలో కీలక మార్పులు చేపట్టిన మనోహర్ తొలిసారి మహిళా డైరెక్టర్ను నియమించాడు. పెప్సీకో చైర్పర్సన్ ఇంద్రనూయిని ఐసీసీ తొలి మహిళా డైరెక్టర్గా నియమించాడు. ఈ జూన్లో డబ్లిన్లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశాల్లో ఆమెకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక ఐసీసీ పరిపాలన విధానం సహా ఆర్థిక పంపిణీ వాటాల్లోనూ గణనీయమైన మార్పులు చేపట్టారు. ఈ మార్పుల వల్ల పెద్ద క్రికెట్ బోర్డులతో పాటు చిన్న క్రికెట్ బోర్డులు సైతం మెరుగైన ఆదాయాన్ని పొందగల్గుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్ శక్తి, పెద్దన్న బీసీసీఐని ఒప్పించటంలో మనోహర్ సఫలీకృతమయ్యారు!.
ఐసీసీ చైర్మెన్గా తిరిగి ఎన్నిక కావటం గౌరవంగా భావిస్తున్నాను. ఏకగ్రీవంగ ఎన్నుకున్నందుకు బోర్డు డైరెక్టర్లకు ధన్యవాదాలు. గత రెండేండ్లుగా బృందంగా చెప్పుకొదగిన విజయాలు సాధించాం.
రానున్న రెండేండ్లలో భాగస్వామ్య సభ్య దేశాలతో కలిసి గ్లోబల్ వ్యూహం రూపొందిస్తాం.
ప్రపంచం క్రికెట్ను ఆస్వాదించే విధంగా క్రికెట్ను అభివృద్ది పరుస్తాం.
ప్రపంచ క్రికెట్ ప్రస్తుతం ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంది. క్రికెట్ పరిరక్షకులుగా
అది అదే రీతిలో కొనసాగేందుకు మేము మరింత కష్టపడాల్సి ఉన్నది'
- శశాంక్ మనోహర్, ఐసీసీ చైర్మెన్