Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యూహ బృందం నివేదిక
- నేడు బీసీసీఐ భేటీలో చర్చ
నవతెలంగాణ-న్యూఢిల్లీ : ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) కొన్ని భయాలున్నాయి!. వేగంగా మార్పులు చెందుతున్న క్రీడా రంగంలో ఇతర ఆటల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీ సహా క్రికెట్లోనే రెబల్ సంఘాలు వచ్చే ప్రమాదముందని ఐసీసీ భయపడుతోంది. ఐసీసీ వ్యూహ బృందం రూపొందించిన 18 అంశాలతో కూడిన నివేదక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. నేడు ఐసీసీ వర్కింగ్ గ్రూప్ భారత క్రికెట్ ఉన్నతాధికారులతో సమావేశంలో ఈ అంశాలు చర్చకు రానున్నాయి. ఐసీసీ వ్యూహ బృందంలో బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి డెవిడ్ పీవీర్, సింగపూర్ అధికారి ఇమ్రాన్ కరంబమి, వెస్టిండీస్ బోర్డు అధ్యక్షుడు డెవ్ కామెరూన్, మహిళా ప్రతినిధి క్లారె కానెర్లు సభ్యులుగా ఉన్నారు. భారత క్రికెట్ నుంచి నిషేధించబడిన ఓ అధికారి మూడేండ్ల క్రితం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులతోనూ, క్రికెటర్లతోనూ సంప్రదింపులు జరిపారు. ఐసీసీకి సమాంతరంగా రెబల్ సంఘాన్ని నెలకొల్పేందుకు పావులు కదిపారు. క్రికెటర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ అది అమల్లోకి రాలేదు. లలిత్ మోడీ ఈ పని చేశాడని బహిరంగ రహస్యమే. ఇదే సమయంలో యు.ఏ.ఈ క్రికెట్ బోర్డు నిరుడు డిసెంబర్లో టీ20 ఫార్మాట్తో లీగ్ నిర్వహించింది. ఈ లీగ్లో స్టార్ క్రికెటర్లు ఇయాన్ మోర్గాన్, షోయబ్ మాలిక్, డ్వేన్ బ్రావోలు అందులో పాల్గొన్నారు. టీ20కి ఆదరణ పెరిగిన రోజుల్లో టీ10 వస్తే టెస్టుల పరిస్థితి ఏమవుతుందో నని ఐసీసీ ఆందోళన. క్రికెట్కు బలమైన ఆదరణ ఉన్న దేశాల్లో ఫుట్బాల్కు ప్రాచుర్యం పెరగటం పట్ల ఐసీసీ ఆందోళన చెందుతోంది. ఇవి సహా నివేదిక లోని కీలక అంశాలపై బీసీసీఐ ఉన్నతాధికారులు సి.కె ఖన్నా, అమితాబ్ చౌదరి, అనిరుధ్ చౌదరిలతో ఐసీసీ వర్కింగ్ గ్రూప్ చర్చించనున్నది.