Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూర్ : సాధికారిక విజయాలతో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన తొలి జట్టు సన్రైజర్స్. ఆఖర్లో విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్స్పై ఆశలు పెట్టుకున్న జట్టు బెంగళూర్. ఇప్పుడీ రెండు జట్లు మరోమారు ముఖాముఖి పోరుకు సిద్ధమ య్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. మిగిలిన రెండు మ్యాచుల్లో ఓడినా టాప్-2లో చోటు ఖాయం. కానీ బెంగళూర్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలవా లంటే బెంగళూర్ చివరి రెండు మ్యాచుల్లో గెలు పొందాలి. సన్రైజర్స్ బౌలర్లతో పాటు బ్యాట్స్మెన్ సైతం ఫామ్లోకి వచ్చారు. ఇదే సమయంలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూర్కు ఇప్పు డు బౌలర్ల అండ తోడైంది. దీంతో నేటి మ్యాచ్పై అంచనాలు భారీగా పెరిగాయి. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ సహా పార్దీవ్ పటేల్లు బెంగళూర్కు భారీ స్కోరు అందించటంలో కీలకం. ఉమేశ్ యాదవ్ బంతితో నిప్పులు చెరుగుతున్నారు. సన్రైజర్స్ తరఫున శిఖర్ ధావన్, విలియమన్స్లు కీలక ఆటగాళ్లు. భువనేశ్వర్ వర్సెస్ కోహ్లి, రషీద్ ఖాన్ వర్సెస్ డివిలియర్స్ పోరు అభిమానులకు వినోదం పంచనున్నది.