Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల టీ20 మ్యాచ్కు జట్ల ప్రకటన
ముంబయి : మహిళల ఐపీఎల్కు సన్నాహకంగా నిర్వహించబోతున్న ఉమెన్స్ టీ20 చాలెంజ్ పోరులో పది మంది విదేశీ స్టార్స్ కనువిందు చేయబోతున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో, గ్లోబల్ టీ20 లీగ్ల్లో సత్తా చాటుతున్న స్టార్స్ మే 22న వాంఖడేలో అదరగొట్టేందుకు భారత్కు రానున్నారు. ఈ మేరకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం ఉమెన్స్ టీ20 చాలెంజ్ మ్యాచ్కు జట్లను ప్రకటించింది. భారత జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతీ మందానలు ఈ మ్యాచ్లో చెరో జట్టుకు నాయకత్వం వహించనున్నారు. ఆస్ట్రేలియా మెరుపు అలిసా హీలె, మెగ్ లానింగ్లు ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. మే 22న ఐపీఎల్ క్వాలిఫయర్ 1 మ్యాచ్కు ముందు మహిళల టీ20 పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్కు మొత్తం 26 మందిని ఎంపిక చేయగా, వారిలో పది మంది విదేశీ క్రీడాకారిణులు ఉన్నారు. ఐపీఎల్ తరహాలోనే ప్రతి జట్టులో గరిష్టంగా నలుగురు విదేశీ క్రికెటర్లు ఆడవచ్చు.
ఐపీఎల్ ట్రయల్బ్లేజర్స్ : స్మృతీ మంధాన (కెప్టెన్), అలిసా హీలె (వికెట్ కీపర్), సుజి బేట్స్, దీప్తి శర్మ, బెతె మూనీ, జెమీమా రొడ్రిగస్, డానియెల్ హజెల్, శిఖా పాండే, లీ తహుహు, జులన్ గోస్వామి, ఎక్తా బిస్త్, పూనమ్ యాదవ్, హేమలత.
ఐపీఎల్ సూపర్నోవా : హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), డానిల్లె వ్యాట్, మిథాలీ రాజ్, మెగ్ లానింగ్, సోఫీ డివైన్, ఎలిసీ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మోన మెష్రం, పూజ వాస్ట్రాకర్, మేఘన్ స్కట్, రాజేశ్వరి గైక్వాడ్, అనుజా పాటిల్, తనియ భాటియా (వికెట్ కీపర్).