Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు క్రికెట్ మార్కెటింగ్పై గంభీర్
న్యూఢిల్లీ : క్రికెట్ చరిత్రకారుడు బొరియాత మజుందార్ రచించిన ' ఎలెవన్ గాడ్స్ అండ్ బిలియన్ ఇండియన్స్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ మాట్లాడిన సమయంలో అతడితో కలిసి పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు, బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీలు వేదికను పంచుకోవటం గమనార్హం. ' టెస్టు క్రికెట్ను సరైన రీతిలో మార్కెటింగ్ చేయటంలో బీసీసీఐ కృషి చేసిందని నేను అనుకోను. 2011 కోల్కత టెస్టు అనుభవం నాకింకా గుర్తుంది. సచిన్ టెండూల్కర్, వీరెందర్ సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్లు ఆడుతున్న టెస్టుకు ఈడెన్గార్డెన్స్లో తొలి రోజు కేవలం 1000 మంది అభిమానులే ఉన్నారు' అని గంభీర్ అన్నాడు. వన్డే, టీ20 ఫార్మాట్లను మార్కెటింగ్ చేయటంలో చూపిన శ్రద్ద బీసీసీఐ టెస్టుల విషయంలో చొరవ తీసుకోలేదని గంభీర్ బాహాటంగానే విమర్శించాడు.