Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలేషియాపై 3-2తో గెలుపు
- ఆసియా హాకీ చాంపియన్షిప్స్
డాంగౌ సిటీ : వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ ఇండియా హాకీ అమ్మాయిలో ఆసియా హాకీ చాంపియన్షిప్స్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో మలేషియాను 3-2తో మట్టికరిపించిన అమ్మాయిలు మరో ఉండగానే టైటిల్ పోరుకు చేరుకున్నారు. లీగ్ దశ విజయాలతో తొమ్మిది పాయింట్లు సాధించిన అమ్మాయిలు.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్లో ఆతిథ్య కొరియాతో తలపడాల్సి ఉన్నది. ఆ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే మనోళ్లు అంతిమ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. గుర్జీత్ కౌర్, వందన కత్రియాన, లాల్రెమ్సియామిలు భారత్ తరఫున గోల్స్ కొట్టగా.. రషీద్ నురేషి, హనిషిలు మలేషియాకు గోల్స్ అందించారు. ఆదివారం ఫైనల్స్కు ముందు శనివారం కొరియాతో భారత్ తలపడనున్నది.