Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెజ్లింగ్ క్యాంప్ నుంచి వేటు
- భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయం
న్యూఢిల్లీ : మహిళల రెజ్లింగ్లో భారత స్టార్స్, దంగల్ సిస్టర్స్గా గుర్తింపు పొందిన ఫోగట్ సోదరీమణులపై భారత రెజ్లింగ్ సమాఖ్య వేటు వేసింది. ఆసియా గేమ్స్కు సన్నాహకంగా లక్నోలో నిర్వహిస్తున్న శిక్షణా శిబిరానికి ఫోగట్ సిస్టర్స్ హాజారు కావాల్సి ఉన్నది. కానీ ఫోగట్ సిస్టర్స్ సహా 13 మంది లక్నో శిబిరానికి వెళ్లలేదు. క్యాంప్కు రాలేకపోవడానికి గల కారణాలను సైతం వీరు అధికారులకు, కోచ్లకు తెలియజేయలేదు. దీంతో రెజ్లర్ల నిర్లక్ష్యాన్ని తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణించిన రెజ్లింగ్ సమాఖ్య అందరిపైనా వేటు విధించింది. బబితా ఫోగట్, గీతా ఫోగట్, రీతూ ఫోగట్, సంగీత ఫోగట్లు సహా ఇతర రెజ్లర్లపై వేటు పడింది. ఆసియా గేమ్స్కు అర్హత సాధించాలంటే లక్నో శిక్షణ శిబిరంలో పాల్గొనటం తప్పనిసరి. సమాఖ్య వీరందరికీ నోటీసులు పంపించింది. సహేతుక కారణాలని సమాఖ్య విశ్వసితే ఆసియా గేమ్స్ ట్రయల్స్కు అనుమతిస్తారు. ఇక గాయం కారణంగానే క్యాంప్కు వెళ్లలేదని బబితా కుమారి పేర్కొన్నది. ఇదే సమయంలో గీత ఫోగట్ బెంగళూర్లోని ప్రయివేట్ అకాడమీలో శిక్షణ పొందుతుందని, క్యాంప్కు ఆమె ఎందుకు రిపోర్టు చేయలేదో తెలియదని బబిత తెలిపింది.