Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్రైజర్స్పై కోహ్లిసేన గెలుపు
- విలియమ్సన్, పాండే పోరాటం వృథా
నవతెలంగాణ-బెంగళూర్ : బెంగళూర్ బ్రతికిపోయింది. కీలక మ్యాచ్లో సన్రైజర్స్పై గెలుపొందిన కోహ్లిసేన ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకున్నది. సన్రైజర్స్ను నిలువరించిన బెంగళూర్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. 219 పరుగుల ఛేదనలో కేన్ విలియమ్సన్ (81, 42 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లు), మనీశ్ పాండే (62 నాటౌట్, 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించినా సన్రైజర్స్ 204 పరుగులే చేయగల్గింది. ఆఖరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా.. హైదరాబాద్ కేవలం 5 పరుగులే చేసింది. ఏబీ డివిలియర్స్ (69, 39 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), మోయిన్ అలీ (65, 34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లు) విజృంభించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూర్ 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. గ్రాండ్హోమె (40, 17 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్తో మెప్పించాడు. హైదరాబాద్ పేసర్ బసిల్ తంపీ నాల్గు ఓవర్లలోనే 70 సమర్పించుకున్నాడు. ఐపీఎల్లో ఓ బౌలర్కు ఇదే అత్యంత చెత్త రికార్డు.
ఏబీ, మోయిన్ మోత
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూర్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ పార్దీవ్ పటేల్ (1) ఆరంభంలోనే అవుటయ్యాడు. ఫామ్లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి (12) ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. ఐనా బెంగళూర్ ఇన్నింగ్స్ జోరుగా సాగింది. ఏబీ డివిలియర్స్ (69), మోయిన్ అలీ (65) బౌండరీల మోత మోగించారు. స్లాగ్ ఓవర్లలో దండెత్తినట్టు పోటీపడుతూ పరుగులు పిండుకున్నారు. ముఖ్యంగా మోయిన్ అలీ అర డజను సిక్సర్లతో చెలరేగగా... డివిలియర్స్ డజను ఫోర్లతో దుమ్మురేపాడు. ఏబీ, అలీ జోరుతో మూడో వికెట్కు బెంగళూర్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసింది. వీరిద్దరినీ స్పిన్నర్ రషీద్ స్వల్ప విరామంలో వెనక్కి పంపినా.. బెంగళూర్ పరుగుల వరద ఆగలేదు. గ్రాండ్హోమె (40) నాల్గు సిక్సర్లతో ధనాధన్ అనిపించాడు. బెంగళూర్కు 218 పరుగుల భారీ స్కోరు అందించాడు. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (22) సైతం ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.