Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పటౌడీ స్మారక ఉపన్యాసంపై రగడ
- సీవోఏ ఎంపిక చౌదరి అసంతృప్తి
నవతెలంగాణ-ముంబయి
పాలకుల కమిటీ, బీసీసీఐ ఆఫీస్ బేరర్ల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉన్నది. ఆఫీస్ బేరర్లను పక్కనపెట్టి పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు కీలక నిర్ణయాలు తీసుకోవటంపై గుర్రుగా ఉన్న ఉన్నతాధికారులు.. మరోసారి తమ అసంతృప్తి వెళ్లగక్కారు. ఈసారి సీవోఏ, బీసీసీఐ అధికారుల మధ్య రగడకు పటౌడీ స్మారక ఉపన్యాసం కారణ మైంది. 2013 నుంచి ప్రతి ఏటా దిగ్గజ క్రికెటర్ టైగర్ పటౌడీ అలీ ఖాన్ స్మారకోపన్యాసం బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో భాగ మైంది. సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, ఫారుక్ ఇంజనీర్లు గతంలో పటౌడీ స్మారకోపన్యాసం చేశారు. ఈ ఏడాది బెంగళూర్లో జూన్ 12న బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం జరగాల్సి ఉన్నది. దీనిలో భాగంగా పటౌడీ స్మారకోపన్యాసం కోసం తొలుత శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరను ఎంచుకున్నా jరు. కానీ సంగక్కర అందుబాటు లో లేకపోవటంతో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ను సీవోఏ ఎంచుకున్నది. ఈ నిర్ణయాలపై బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిజానికి సంగక్కరను ఖరారు చేసినప్పుడే చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశాడు. పటౌడీతో కలిసి ఆడిన చందూ బోర్డె, నారీ కాంట్రా క్టర్, ఎరాపల్లి ప్రసన్న, అబ్బాస్ అలీ బేగ్ వంటి వారితో స్మారకోపన్యాసం ఇప్పిస్తే ఉపయుక్తంగా ఉంటుందని చౌదరి లేఖలో పేర్కొన్నాడు. బీసీసీఐ జనరల్ మేనే జర్ సబా కరీం రూపొందించిన షార్ట్ లిస్ట్లో కెవిన్ పీటర్సన్, కుమార సంగక్కర, నాజీర్ హుస్సేన్, సౌర భ్ గంగూలీలు ఉన్నారు. గత ఐదు సీజన్లలో భారత క్రికెటర్లే స్మారకోపన్యాసం చేయగా.. ఈసారి విదేశీ యు లకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావట్లేదని అమితాబ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
కాగా సీవోఏతో దగ్గర గా పనిచేస్తున్న బీసీసీఐ అధికారుల వాదన మరోలా ఉంది. పటౌడీ స్మారక ఉప న్యాసం కేవలం భారత క్రికెటర్ల కోసమే ఏర్పాటు చేయలేదని, విదేశీయులు స్మారకోపన్యాసం చేయవచ్చ ని వివరణ ఇచ్చారు. సౌరభ్ గంగూలీ పేరు ఖరారు చేసేందుకు అతడు ప్రస్తుతం క్రికెట్ పాలకుడిగా కొనసాగుతుండటమే కారణమని అన్నారు. కుమార సంగక్కర అందుబాటులో లేకపోవటంతో కెవిన్ పీటర్సన్ను సంప్రదించగా అతడు అంగీకరించాడు. అందుకే పీటర్సన్ను ఎంచుకున్నామని చెప్పారు. కాగా క్రికెట్లో సొంత జట్టుకు నమ్మకంగా లేని, కెరీర్లో ఎన్నో మరకలున్న పీటర్సన్ క్రికెట్లో పీస్ గురించి ఏమని సందేశం ఇస్తాడని చౌదరి ప్రశ్నించాడు.