Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన క్రిస్ లిన్, ఉతప్ప
- హైదరాబాద్కు మరో ఓటమి
నవతెలంగాణ-హైదరాబాద్
సన్రైజర్స్పై కోల్కత ఆధిపత్యం చాటుకున్నది. ఇంటా బయటా నెగ్గి హైదరాబాద్పై పైచేయి సాధించింది. ప్లే ఆఫ్స్ రేసులో కీలక మ్యాచ్లో సన ్రైజర్స్పై 5వికెట్ల తేడాతో గెలుపొందిన కోల్కత నైట్రైడర్స్ ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టింది. హైదరా బాద్, చెన్నై తర్వాత ప్లే ఆఫ్స్కు చేరిన మూడో జట్టు కోల్కత. నాల్గో స్థానం కోసం రాజస్థాన్, పంజాబ్, ముంబయి ఇండియన్స్లు పోటీపడుతున్నాయి. నేటి మ్యాచుల్లో ప్లే ఆఫ్స్ తుది బెర్త్ ఎవరితో తేలనున్నది. ఛేదనలో కోల్కత ఓపెనర్ క్రిస్ లిన్ (55, 43 బంతు ల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు), రాబిన్ ఉతప్ప (45, 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించటంతో మరో 2 బంతులుండగానే కోల్కత గెలుపొందింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (26), సునీల్ నరైన్ (29) రాణించారు. అంతకముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ సొంతగడ్డపై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (50, 39బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. వికెట్ కీపర్ గోస్వామి (35), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (36, 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించారు. కోల్కత బౌలర్లలో యువ పేసర్ ప్రసిద కృష్ణ (4/30) నాల్గు వికెట్ల ప్రదర్శన చేశాడు. ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా నిలిచిన హైదరాబాద్ లీగ్ దశను ఓటమితో ముగించింది.
ధావన్ ఫిఫ్టీ : టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఆడుతున్న సన్రైజర్స్ ఓపెనింగ్ జోడీలో మార్పులు చేసింది. అలెక్స్ హేల్స్ స్థానంలో వికెట్ కీపర్ శ్రీవాత్సవ గోస్వామి ఓపెనర్ అవతారం ఎత్తాడు. శిఖర్ ధావన్ (50, 39 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), గోస్వామి (35, 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)లు హైదరాబాద్కు అదిరే ఆరంభాన్ని అందించారు. ధావన్ అర్ధ సెంచరీతో చెలరేగగా.. గోస్వామి సమయోచిత ఇన్నింగ్స్తో మెప్పించాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 79 పరుగులు జోడించారు. ఓపెనర్ల జోరుతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించేలా కనిపించింది. కానీ కోల్కత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. మిడిల్ ఆర్డర్లో కేన్ విలియమ్సన్ (36, 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్) మరోమారు మెరుపు ఇన్నింగ్స్తో దండెత్తాడు. మూడు భారీ సిక్సర్లు కొట్టిన విలియమ్సన్.. ఫామ్ కొనసాగించాడు.
కానీ జోరుమీదున్న విలియమ్సన్ను సీరెల్స్ అవుట్ చేసి కోల్కతను రేసులోకి తీసుకొచ్చాడు. మనీశ్ పాండే (25, 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) జిడ్డుగా ఆడాడు. దీంతో ఆఖరి ఓవర్లలో హైదరాబాద్ పరుగుల వేగంగా అమాంతం పడిపోయింది. యూసుఫ్ పఠాన్ (2), బ్రాత్వైట్ (3), రషీద్ ఖాన్ (0)లు ఆఖర్లో దూకుడుగా ఆడలేకపోయారు. షకిబ్ అల్ హసన్ (10) రెండు ఫోర్లు కొట్టాడు. ఆఖరి ఓవర్లోనే నాలుగు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 172 పరుగులు చేసింది. కోల్కత బౌలర్లలో ప్రసిద కృష్ణ (4/30) నాల్గు వికెట్ల ప్రదర్శన చేశాడు. రస్సెల్, చావ్లా, నరైన్, కుల్దీప్లు తలా ఓ వికెట్ పడగొట్టారు.