Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకాక్ : థామస్ కప్, ఉబర్ కప్ ఫైనల్స్లో భారత్కు ఆరంభంలోనే చేదు అనుభవం ఎదురైంది. పురుషుల, మహిళల జట్లు ఆదివారం దారుణ ఓటమిని చవిచూసి, నాకౌట్ అవకాశాలను సంక్షిష్టం చేసుకు న్నాయి. గ్రూప్-ఎలో ఫ్రాన్స్తో తలపడిన పురుషుల జట్టు 1-4తో ఓటమిపాలవగా, కెనడా చేతిలో అమ్మాయిలూ 1-తో పరాజయం పాలయ్యారు. మెన్స్ జట్టుకు సాయిప్రణీత్ 21-7, 21-18తో శుభారంభం అందించాడు. కానీ తర్వాతి నాల్గు మ్యాచుల్లోనూ మనోళ్లు నిరాశపరిచారు. మహిళల జట్టు సారథి సైనా నెహ్వాల్ ఓటమితో భారత్ను దెబ్బతీసింది. తొలి మ్యాచ్లో సైనా నెహ్వాల్ 21-15, 16-21, 16-21తో మిచెలీ లీ చేతిలో ఓడింది. డబుల్స్లో జక్కంపూడి మేఘన, పూర్విశ జోడీ 21-19, 21-15తో గెలిచి వైట్వాష్ ప్రమాదం తప్పించారు. నేడు పురుషుల, మహిళల జట్లు ఆస్ట్రేలియాతో తలపడనున్నాయి.