Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: బీసీసీఐలో అభిప్రాయభేదాలు మరోసారు బయటపడ్డాయి. పటౌడీ స్మారకోపన్యాసం పై సీవోఏ, ఆఫీస్ బేరర్ల నడుమే కాదు ఆఫీస్ బేరర్లలోనూ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ మేరకు సీవోఏతో నడిపిన ఈమెయిల్ సందేశాలతో ఈ విషయం బయటపడింది. బీసీసీఐ జనరల్ మేనేజర్ సబా కరీం రూపొందించిన జాబితా నుంచి ఆఫీస్ బేరర్లు అందరూ సౌరవ్ గంగూలీని ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యతగా కొందరు పీటర్సన్ను, మరికొందరు సంగక్కరను సూచించారు. కానీ ఎవ్వరూ జాబితాలో విదేశీయులపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆ పని కార్యదర్శి అమితాబ్ చౌదరి చేశాడు. పటౌడీ స్మారక ఉపన్యాసం ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వెలువరించటంపై చౌదరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. సొంత జట్టుకు నమ్మకంగా లేని పీటర్సన్ ఏం సందేశమిస్తాడని ప్రశ్నించాడు. కానీ ఈ విషయంలో సి.కె ఖన్నా, అనిరుధ్ చౌదరిలు మరో అభిప్రాయంతో ఉన్నారు. పటౌడీ స్మారక ఉపన్యాసానికి పీటర్సన్ను ఎంపిక చేస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అమితాబ్ అభ్యంతరాలపై పాలకుల కమిటీ స్పందించలేదు.