Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత కెప్టెన్కు రాయ్ కితాబు
న్యూఢిల్లీ : భారత క్రికెట్లో బలీయమైన శక్తిగా ఎదుగుతున్న ఆటగాడు విరాట్ కోహ్లి. ఎం.ఎస్ ధోని నుంచి వన్డే, టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాతత కోహ్లి హవా మరింత ఎక్కువైంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ వర్గాలే చెబుతాయి!. అనిల్ కుంబ్లే భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవటం వెనుక కోహ్లి హస్తం ఉందనే చాలా మంది విశ్వసించారు. విధానపరమైన నిర్ణయాల్లో కెప్టెన్ జోక్యం చేసుకుంటున్నాడని చెప్పేందుకు ఇంతకు మించిన నిదర్శనం ఏముం టుందని కొందరు ప్రశ్నించారు. కానీ కెప్టెన్గా తన పలుకుబడిని కోహ్లి దుర్వినియోగం చేశాడని నేను అనుకోవటం లేదని పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు అభిప్రాయపడ్డాడు. న్యూఢిల్లీలో జింఖానాలో మాట్లాడిన వినోద్ రారు భారత కెప్టెన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' ఏ కెప్టెన్ అయినా జట్టుపై తన ప్రభావం ఉండాలని కోరుకుంటాడు. అటువంటి ప్రభావాన్ని స్వాగతించే వ్యక్తిని నేను. అయితే నేనో విషయం చెబుతాను. ఇప్పటి వరకూ ఎవ్వరూ నా వద్దకు వచ్చి విరాట కోహ్లి తన పలుకుబడితో ప్రభా వితం చేస్తున్నాడని ఫిర్యాదు చేయలేదు. వ్యక్తి గతంగా నాతో విరాట్ ప్రవర్తన బాగుంటుంది. నన్ను ఏ విషయంలోనూ అతడు ఒత్తిడి చేయలేదు. జట్టు మేనేజ్మెంట్, సెలక్టర్లు ఎవ్వరూ అతడిపై ఫిర్యాదు చేయలేదు' అని రారు తెలిపాడు. సెలక్టర్లపై ఒత్తిడి ఉందని నేరుగా నాకు తెలియదు. కానీ జనవరిలో ఎమ్మెస్కే ఒత్తిడిలో ఉన్నాడని అర్థమైంది. అప్పుడత డు ఫోన్ స్విచ్చాఫ్ చేసి, జట్టును ఎంపిక చేసినట్టు నాకు చెప్పారు. ఎమ్మెస్కే ఒత్తిడికి లొంగేవాడు కాదు. స్టార్ పవర్ను నిలువరించగల సామర్థ్యం అత డికుంది. అఫ్ఘనిస్థాన్తో టెస్టు జట్టును విరాట్ లేని ఆటగాళ్ల బృందం నుంచి ఎంచుకున్నాడు. నేను కానీ, ఎదుల్జీ కానీ సెలక్షన్ కమిటీ సమావేశంలో కూర్చో లేదు' అని రారు వెల్లడించాడు. ఇక డే నైట్ టెస్టుల పై మాట్లాడుతూ.. 'జట్టు 2019 ప్రపంచకప్ సన్నద్ధ తలో ఉంది. ఇప్పుడు గులాబీ బంతితో ప్రయోగానికి సిద్ధంగా లేదు' అని రవిశాస్త్రి చెప్పాడు. కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ సహా ఇతరుల అభిప్రాయాలను తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాడు.