Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకాక్ : కెనడా చేతిలో కంగుతిన్న టీమ్ ఇండియా.. వెంటనే ఆస్ట్రేలియాపై ఏకపక్ష విజయంతో పుంజుకున్నది. కానీ నాకౌట్ దశకు చేరుకోవాలంటే గ్రూప్ దశలో భారత్కు మరో విజయం అవసరం. ఆస్ట్రేలియాపై 4-1తో నెగ్గిన మహిళల జట్టు.. నేడు పటిష్ట జపాన్ను ఢకొీట్టనున్నది. స్టార్ షట్లర్ పి.వి సింధు లేని వేళ బలమైన జపాన్ను ఢకొీట్టడం శక్తికి మించిన పనే అవుతుంది!. అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మాత్రమే మహిళల జట్టులో జపాన్ను ఢకొీనగల షట్లర్. మిగతా అందరూ ద్వితీయ శ్రేణి క్రీడాకారిణులే ఉన్నారు. కానీ జపాన్ వైపు టాప్ షట్లర్ అకానె యమగూచి, నొజొమి ఒకుహర, సయాక సటోలు బరిలో నిలిచారు. ఈ ముగ్గురూ మూడు సింగిల్స్లో బరిలోకి దిగుతున్నారు. డబుల్స్లోనూ జపాన్ బలంగా ఉంది. మిసాకి, అయాక జోడీ సహా యూకి, సయాకలు టాప్ క్లాస్ ప్లేయర్స్. గ్రూప్లో రెండు విజయాలతో జపాన్ ఇప్పటికే నాకౌట్కు చేరుకున్నది. నేడు జపాన్పై నెగ్గితే భారత్కూ నాకౌట్ అవకాశాలు ఉంటాయి. మరోవైపు థామస్ కప్ రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 5-0తో నెగ్గిన పురుషుల జట్టు.. మంగళవారం చైనా చేతిలో 0-4తో చిత్తుగా ఓడింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది.