Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌంటీ క్రికెట్కు దూరం
- జూన్ 15న ఫిట్నెస్ పరీక్ష
నవతెలంగాణ-ముంబయి
బీసీసీఐలోనూ, క్రికెట్ వర్గాల్లోనూ విపరీతమైన చర్చకు దారితీసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీ క్రికెట్ అరంగేట్రానికి అనూహ్యంగ్ బ్రేక్ పడింది. ఐపీఎల్ లీగ్ దశలో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా విరాట్ కోహ్లి గాయానికి గురయ్యాడు. అయినప్పటికీ విరాట్ ఆ మ్యాచ్లో, రెండు రోజుల తర్వాత మరో మ్యాచ్లోనూ పాల్గొన్నాడు. దీంతో గాయం మరింత ముదిరింది!. ముంబయిలోని ప్రముఖ ఆర్థోపెడిక్ (ఎముకల) వైద్యుడిని విరాట్ కోహ్లి సంప్రదించటంతో గాయం విషయం వెలుగులోకి వచ్చింది. ముంబయి మిర్రర్ పత్రిక కోహ్లి గాయంపై కథనం ప్రచురించగా.. తొలుత బీసీసీఐ ఖండించింది. కానీ వైద్య పరీక్షల్లో కోహ్లి 'మెడ ఎముక (హెరినేటెడ్ డిస్క్)' గాయానికి గురయ్యాడని తేలింది. సరైన విశ్రాంతి లేకుంటే ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కూ దూరమయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించారు. దీంతో కోహ్లి గాయంపై బీసీసీఐ గురువారం ప్రకటన చేసింది. ' స్పెషలిస్ట్ వైద్యుడితో సంప్రదింపులు, సవివరమైన స్కానింగ్ల తర్వాత విరాట్ కోహ్లి విశ్రాంతి అవసరమైన బీసీసీఐ వైద్యుల బృందం నిర్ణయించింది. జూన్ 15 నుంచి బెంగళూర్లోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోహ్లి సాధన మొదలవుతోంది. అక్కడ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉంటాడు. ఎన్సీఏలోనే కోహ్లి ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కొంటాడు. అతడు త్వరలోనే ఫిట్నెస్ సాధిస్తాడని వైద్య బృందం ఆశాభావం వ్యక్తం చేసింది' అని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది.
సుదీర్ఘ చర్చలు, నిర్ణయంపై బోర్డులో విభేదాల తర్వాత జూన్లో కోహ్లి కౌంటీ క్రికెట్లో ఆడతాడని బీసీసీఐ ప్రకటించింది. కానీ ఇప్పుడు కోహ్లికి గాయం కావటంతో కౌంటీ క్రికెట్లో ఆడటం లేదు. మంగళవారం ఉదయమే కౌంటీ క్లబ్ సర్రేకు కోహ్లి గాయంపై సమాచారమిచ్చారు. జూన్ 14 నుంచి అఫ్ఘనిస్థాన్తో టెస్టు సందర్భంగా కోహ్లి బెంగళూర్లోనే ఉండనున్నాడు (ఎన్సీఏలో). పూర్తి ఫిట్నెస్ సాధిస్తే ఐర్లాండ్తో టీ20 సిరీస్కు లేదంటే ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల పోటీలకు అక్కడికి వెళ్లనున్నాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో 10 ఇన్నింగ్స్ల్లో కలిపి 134 పరుగులే చేసిన విరాట్ కోహ్లి.. కౌంటీ అనుభవంతో ఈ సారి పర్యటనలో రెచ్చిపోవాలని చూశాడు. చీఫ్ కోచ్ రవిశాస్త్రి, సీవోఏ చైర్మన్ వినోద్ రారులు సైతం ఇంగ్లాండ్ సిరీస్కు ఆటగాళ్లను వీలైనంత త్వరగా అక్కడికి పంపించాలనే ఆలోచనతో ఉండటంతో.. కోహ్లి కౌంటీ క్రికెట్కు మార్గం సుగమం అయ్యింది. కానీ అనుకోని రీతిలో గాయం కౌంటీలకు కోహ్లిని దూరం చేసింది.