Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 70 ఏండ్ల నిబంధన తెచ్చిన చిక్కు
ముంబయి : బీసీసీఐ వ్యవహారాల పర్యవేక్షణకు సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు ఈ వారంలో 70 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. 2016 జులై 18న సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బీసీసీఐ జస్టిస్ లోధా కమిటీ సిఫారసులు అమలు చేయాలి. కానీ బోర్డు ఆ పని చేయలేదు. దీంతో నిరుడు సుప్రీంకోర్టు పాలకుల కమిటీని నియమించింది. జస్టిస్ లోధా సిఫారసుల్లో కీలకమైనది గరిష్ట వయో పరిమితి 70 ఏండ్లు. ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కార్యదర్శి చౌదరికి రారు ఆదేశించారు. అందులో 70 ఏండ్లు పైబడిన వారు సమావేశానికి రావటానికి వీల్లేదని నిబంధన విధించారు. 70 ఏండ్ల వయో పరిమితితో బోర్డులో పదవి కోల్పోయిన వెటరన్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ నిరంజన్ షా.. ఈ సందర్భంగా పాలకుల కమిటీ చైర్మన్పై వేలెత్తి చూపుతున్నాడు. జస్టిస్ లోధా కమిటీ నిబంధనలు తొలుత పాలకుల కమిటీ పాటించి, తర్వాత బోర్డులో అమలు చేసేందుకు చూడాలని వ్యంగ్యాస్త్రాలు సంధిం చారు. 70 ఏండ్ల నిబంధన పెట్టిన సుప్రీంకోర్టు.. వినోద్ రారు విషయంలో ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.