Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ ఆటగాళ్లకు ఐసీసీ హెచ్చరిక
దుబాయ్ : ఇంగ్లాండ్తో తొలి టెస్టులో పలువురు పాకిస్థాన్ ఆటగాళ్లు యాపిల్ స్మార్ట్ వాచ్లతో మైదానంలో కనిపించారు. అత్యాధునిక టెక్నాలజితో కూడిన ఈ స్మార్ట్ వాచ్లు సంక్షిప్త సందేశాలు సహా ఫోన్ కాల్స్, ఇతర వివరాలు సైతం అందిస్తాయి. ఇదే సమయంలో ఎంత శారీరక శ్రమతో ఎన్ని కాలరీలు ఖర్యు అయినవో తెలుపుతాయి. పాకిస్థాన్ ఆటగాళ్లు ఫిట్నెస్ స్థాయిలు పెంచుకునేందుకు, మైదానంలో ఎన్ని కాలరీలు కరిగిపోయాయో తెలుసుకునేందుకు వినియోగించామని చెప్పినా.. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధికారులు.. పాక్కు హెచ్చరిక జారీ చేశారు. ఐసీసీ నిబంధనల ప్రకారం సమాచారం చేరవేసే ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు మైదానంలోనే కాదు మ్యాచ్ అఫీసియల్ ఏరియాలోనూ అనుమతి లేదు. ఒకవేళ అటువంటి వస్తువులు ఉంటే స్టేడియంలోకి రాగానే అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. స్మార్ట్వాచ్ల సాయంతో సందేశాలు స్వీకరించే అవకాశం ఉండటంతో.. ఏమైనా తప్పు జరిగితే స్మార్ట్వాచ్లను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఐసీసీ కేవలం హెచ్చరికతోనే వదిలిపెట్టింది.