Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్సీఏలో ధోని కఠోర ప్రాక్టీస్
బెంగళూర్ : కఠినమైన పరీక్షకు అంతే కఠో రంగా శ్రమించటం విజేతల లక్షణం. అదే పని భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని చేస్తున్నాడు. ఇటీవల ఐపీఎల్లో దుమ్ముదులిపిన మహేంద్ర సింగ్ ధోని ఇంగ్లాండ్ పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. రాంచీ స్టేడియంలో అభిమానులు లేదా యువ ఆటగాళ్ల నడుమ సాధన చేసే ఎం.ఎస్ ధోని ఈసారి ఒంటరిగానే ప్రాక్టీస్కు బరిలోకి దిగాడు. ఈ నెల 15న ఇక్కడ జాతీయ క్రికెట్ అకాడమీలో యో యో టెస్టు కోసం వచ్చిన మహి.. ఇక్కడే సాధన చేస్తున్నాడు. గంటల కొద్ది నెట్స్లో చెమటోడ్చిన ధోని.. వందల కొద్ది బంతుల్ని ఎదుర్కొన్నాడు. కెరీర్ చరమాంక దశలోకి ప్రవేశిస్తోన్న మహి.. కెరీర్ను విజయవంతంగా పొడగించుకునేందుకు సాధన వైపు చూస్తున్నాడు. సచిన్ టెండూల్కర్ సైతం కెరీర్ ఆఖర్లో ముంబయి జింఖానాలో తీవ్రంగా సాధన చేసేవాడు. ఇక సోమవారం ఎన్సీఏలో త్రో డవున్ నిపుణుడు రఘు, స్పీడ్స్టర్స్ షార్దుల్ ఠాకూర్, సిద్దార్థ్ కౌల్లు నెట్స్లో మహికి బంతులేశారు. తొలి సెషన్లో రెండున్నర గంటల పాటు రఘు విసిరే బంతు లు, షార్దులు సంధించే బంతులు ఎదుర్కొన్నాడు. ఐతే ఇందులో మహి కొన్ని మిస్ చేసినా.. కొట్టిన బంతుల్ని లయబద్దంగా బాదాడు. ఇక షార్దుల్ ఠాకూర్ బంతులేసే క్రమంలో ఊహాజనిత ఫీల్డింగ్ మొహరింపులు అడిగి తెలుసుకుని, అందుకు అనుగుణంగా మహి షాట్లు ఎంపిక చేసుకున్నాడు. బ్రేక్ తర్వాత జరిగిన మరో సెషన్లో సిద్దార్థ్ కౌల్ నుంచి ధోని బంతులు ఎదుర్కొన్నాడు. సెషన్ పూర్తయ్యాక తన బ్యాటింగ్ తీరు, షాట్ల ఎంపికపై వీడియోను చూసిన మహి.. ప్రాక్టీస్ను ముగించాడు. 2014లో టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని, ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు.