Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ కార్యదర్శికి సీవోఏ సమాధానం
ముంబయి : పాలకుల కమిటీ (సీవోఏ), బీసీసీఐ ఆఫీస్ బేరర్ల నడుమ ఘర్షణ వాతావరణం నడుస్తుండగానే, మరో వివాదస్పద అంశం వెలుగులోకి వచ్చింది. జూన్ 28 నుంచి జులై 2 వరకూ డబ్లిన్లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి, బోర్డు సీఈవో రాహుల్ జోహ్రీలు అక్కడికి వెళుతున్నారు. ఐతే ఐసీసీ భేటి ముగిసిన తర్వాత ఇంగ్లాండ్లోనే ఉండి టీ20 మ్యాచులు చూసిన తర్వాత స్వదేశానికి వస్తానని అమితాబ్ చౌదరి సీవోఏకు సమాచారం అందించారు. దీనికి బదులుగా సీవోఏ చౌదరికి ఈమెయిల్ పంపించింది. ' మీ లేఖను పాలకుల కమిటీ పరిగణనలోకి తీసుకున్నది. ఐనా, విదేశీ ప్రయాణాలకు మీరు సీవోఏ అనుమతి కోరలేదు. డబ్లిన్ సమావే శానికి మాత్రమే మీకు అనుమతి ఉంది. అక్కడ ఉండేందుకు బస, ప్రయాణ ఖర్చులు ఐసీసీ పరిమితం గానే ఏర్పాటు చేస్తోంది. ఇంగ్లాండ్తో టీ20 మ్యాచులు చూడటం ద్వారా బీసీసీఐ కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి, మీరు టీ20 మ్యాచులు చూడాలని భావిస్తే, ఎలాంటి ఖర్చులు బీసీసీఐ భరిం చబోదు' అని సీవోఏ బదులిచ్చింది. ఆసక్తికరంగా సీఈవో రాహుల్ జోహ్రీ సైతం ఇదే తరహాలో సీవోఏకు లేఖ రాశారు. ఇంగ్లాండ్తో తొలి రెండు టీ20 చూసిన తర్వాత జులై 8న స్వదేశానికి వస్తానని చెప్పారు.