Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ షెడ్యూల్
డబ్లిన్ : అంతర్జాతీయ క్రికెట్లో కొత్త పోటీలకు శ్రీకారం చుట్టబోతున్న ఐసీసీ టెస్టు చాంపియన్షిప్, వన్డే లీగ్లకు షెడ్యూల్ విడుదలైంది. టెస్టు చాంపియన్షిప్ జులై 15, 2019-ఏప్రిల్ 30, 2021 వరకు జరుగుతుంది. వన్డే లీగ్ జూన్ 2020 నుంచి ఆరంభమవుతుంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న తొమ్మిది జట్టు టెస్టు చాంపియన్షిప్స్లో పాల్గొంటాయి. ప్రతి జట్టూ రెండేండ్ల కాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్లు ఇంటా, బయటా ఆడాల్సి ఉంటుంది. లీగ్ దశలో అగ్రస్థానాల్లో నిలిచిన తొలి రెండు జట్లు ఫైనల్స్కు అర్హత సాధించనున్నాయి. వన్డే లీగ్ను 2023 వరల్డ్కప్ను అర్హత టోర్నీగా పరిగణించనున్నారు. 12 టెస్టు దేశాలు సహా నెదర్లాండ్స్ వన్డే లీగ్లో పాల్గొంటుంది. టెస్టు చాంపియన్షిప్స్లో భాగంగా టీమ్ ఇండియా పోరాటం 2019 జులైలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్తో ఆరంభం కానున్నది. ఫైనల్స్ను ఇంగ్లాండ్లో నిర్వహిం చాలనే ఐసీసీ భావిస్తుండగా, ఫైనల్స్కు చేరిన దేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ వాదిస్తోంది.