Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం
- ఒలంపిక్ డే రన్ విజయవంతం
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నదని అన్నారు. శనివారం ఒలంపిక్డే రన్ సందర్భంగా హైదరాబాద్లోని చార్మినార్, విక్టరీప్లే గ్రౌండ్, వైఎంసీఏ, సికింద్రాబాద్, జింఖాన గ్రౌండ్, మెహిదీపట్నం, యూసుఫ్గూడ తదితర ప్రాంతాల నుంచి ఎల్బీస్టేడియం వరకూ క్రీడాకారులు, విద్యార్థులు రన్ నిర్వహించారు. అనంతరం ఎల్బీస్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుర్ర వెంకటేశం మాట్లా డుతూ...గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారని చెప్పారు. సాట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ...క్రీడాకారులకు రూ.పదిలక్షల నుంచి రూ.50లక్షల వరకూ రివార్డులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగాల్లో 2శాతం క్రీడాకోటాను క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని స్పోర్టివ్ స్టేట్గా మార్చాలని క్రీడాకారులను కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు పాపారావు, సాట్స్ ఎండీ దినకర్బాబు, వివిధ క్రీడా సంఘాల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.