Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 400 మీ పరుగులో స్వర్ణం సొంతం
- అండర్-20 ప్రపంచ చాంపియన్షిప్స్
టాంపెరె (ఫిన్లాండ్) : ట్రాక్ అండ్ ఫీల్డ్లో సరికొత్త చరిత్ర. భారత యువ సంచలనం అరుదైన ఘనత. 18 ఏండ్ల అస్సాం అమ్మాయి ప్రపంచ చాంపియన్షిప్స్లో అద్భుతం చేసింది. ఐఏఏఎఫ్ అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ స్ప్రింటర్గా రికార్డు నెలకొల్పింది. టాంపెరెలో జరుగుతున్న ఐఏఏఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత స్ప్రింటర్ హిమ దాస్ ఈ ఘనత వహించింది. 400 మీటర్ల పరుగును 51.46 సెకన్లలోనే పూర్తిచేసిన హిమ దాస్.. స్వర్ణ పతకం సొంతం చేసుకున్నది. 52.07 సెకండ్లతో రోమానియా అథ్లెట్ అండ్రియా, 52.28 సెకన్లతో అమెరికా స్ప్రింటర్ టేలర్ మాన్సన్లు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. సెమీఫైనల్స్లో 52.25 సెకన్లతో పతకంపై ఆశలు రేకెత్తించిన హిమ దాస్.. తుది పరుగులో ఏకంగా స్వర్ణమే సొంతం చేసుకున్నది. అండర్-20 ప్రపంచ చాంపియన్షిప్స్లో ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం కావటం విశేషం. 51.32 సెకన్లతో గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో ఆరో స్థానంలో నిలిచిన హిమ దాస్..ఇటీవల జాతీయ చాంపియన్షిప్స్లో 51.13 సెకన్లతో తన టైమింగ్ను ఎంతో మెరుగుపర్చుకున్నది.