Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకాక్ : థాయ్లాండ్ ఓపెన్లో పి.వి సింధు ఒంటరి పోరాటం కొనసాగుతోంది. సహచర షట్లర్లు అందరూ ఇప్పటికే నిష్క్రమించగా స్టార్ షట్లర్ సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో మలేషియా అమ్మాయి సోనియాపై గెలుపొందిన సింధు సెమీస్లో స్థానం సంపాదించింది. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధు ఏకపక్ష విజయం సాధించింది. 21-17, 21-13తో సోనియాను చిత్తు చిత్తుగా ఓడించింది. వరల్డ్ నం.3 సింధు తర్వాత మ్యాచ్లో ఇండోనేషియా షట్లర్ గ్రిగోరియా మరిస్కాతో తలపడనున్నది. కొంత కాలంగా టైటిల్ దాహంతో ఉన్న సింధు.. థారులాండ్లో ఊపుమీదుంది. తొలి గేమ్లో పొరపాట్లు చేసిన సింధు 7-11తో వెనుకంజ వేసింది. కానీ వరుస ఐదు పాయింట్లు సాధించి 13-12తో ఆధిక్యంలోకి వచ్చి.. అదే జోరులో గేమ్ గెల్చుకున్నది. రెండో గేమ్లో సింధు 6-3తో ముందంజ వేసినా సోనియా 8-8తో వెంబడించింది. 11-9తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచిన సింధు ద్వితీయార్థంలో దూకుడుగా ఆడి, సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నది.