Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వన్డేలో భారత్ ఓటమి
లార్డ్స్ : స్పిన్ వలలో చిక్కుకున్న ఇంగ్లాండ్కు ఎట్టకేలకు స్టార్ బ్యాట్స్మన్ జో రూట్ (113, 116 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) గెలుపు దారి చూపించాడు. లార్డ్స్ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 322/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో భారత్ 236 పరుగులకు ఆలౌటైంది. చైనామన్ కుల్దీప్ యాదవ్ (3/68) మరోమారు మాయ చేసినా.. ఈ సారి ఆధిపత్యం ఇంగ్లాండ్ వంతు. వరుసగా విఫలమవుతున్న జో రూట్ స్పిన్ సవాల్కు ఎదురొడ్డి భారత్పై తొలి శతకం సాధించాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (53), టెయిలెండర్ డెవిడ్ విల్లే (50) సహా జేసర్ రారు (40) రాణించారు. ఛేదనలో భారత్ దూకుడుగా ఆడినా వేగంగా వికెట్లు కోల్పోయింది. రోహిత్ (15), రాహుల్ (0) సులువుగా వికెట్లు కోల్పోయారు. కెప్టెన్ కోహ్లి (45), సురేశ్ రైనా (46)లు ఆశలు కల్పించినా.. ఈ ఇద్దరి నిష్క్రమణతో భారత్ పోరాటం నామమాత్రమైంది!. ఆఖర్లో హార్దిక్ పాండ్య (21), ఎం.ఎస్ ధోని (33) పరిస్థితులకు తగ్గట్టు ఆడలేదు. ఇక ఈ మ్యాచ్లో జోశ్ బట్లర్ క్యాచ్తో వన్డేల్లో 300 క్యాచులు అందుకున్న తొలి వికెట్ కీపర్గా నిలిచిన ధోని, లార్డ్స్లోనే వన్డేల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన ఘనత దక్కించుకున్నాడు.