Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకుహరతో టైటిల్ పోరు
బ్యాంకాక్ : ఈ సీజన్లో ఎట్టకేలకు పి.వి సింధు టైటిల్ పోరుకు చేరుకున్నది. సెమీ ఫైనల్లో మెరుపు విజయం సాధించిన వరల్డ్ నం.3 సింధు థారులాండ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. మలేషియా అమ్మాయి సోనియాపై 23-21, 16-21, 21-9తో గెలుపొందిన సింధు నేడు టైటిల్ పోరులో జపాన్ స్టార్ నొజొమి ఒకుహరతో తలపడనున్నది. ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్లో ఒకుహరతో థ్రిల్లింగ్ పోరాటం చేసిన సింధు బ్యాంకాక్లో మళ్లీ సై అంటోంది. టై బ్రేకర్లో ముగిసిన తొలి గేమ్లో సింధు 23-21తో నెగ్గగా.. తర్వాతి గేమ్ను సోనియా సొంతం చేసుకున్నది. 21-16తో సింధును ఒత్తిడిలోకి నెట్టింది. కానీ నిర్ణయాత్మక గేమ్లో సింధు దుమ్మురే పింది. 5-1తో మొదలెట్టిన సింధు.. సోనియాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లతో 21-9తో చిత్తు చేసిం ది. మరో సెమీస్లో ఒకుహర 21-17, 21-10తో జాంగ్పై వరుస గేముల్లో గెలుపొందింది.