Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2 టెస్టులు, 4 వన్డేల్లో నిషేధం
- కోచ్, మేనేజర్లకూ అదే శిక్ష
దుబాయ్ : క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన శ్రీలంక టీమ్ మేనేజ్మెంట్పై ఐసీసీ కొరడా ఝులిపించింది. ఆ జట్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్, కోచ్ చండిక హతురసింగ, మేనేజర్ అశంక గురుసిన్హాలపై గరిష్ట శిక్షలతో వేటు వేసింది. వెస్టిండీస్తో సెయింట్ లుసియా టెస్టులో బాల్ టాంపరింగ్ ఆరోపణలను నిరసిస్తూ.. రెండు గంటల పాటు మైదానంలోకి అడుగుపెట్టని శ్రీలంక జట్టు.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ వద్ద నిరసన వ్యక్తం చేసింది. దీనిపై విచారణ జరిపిన ఐసీసీ జ్యూడిషియల్ కమిషనర్ సోమవారం శిక్షలు ఖరారు చేశారు. బాల్ టాంపరింగ్ వ్యవహారంలో ఇప్పటికే వెస్టిండీస్ ఆఖరి టెస్టులో నిషేధం ఎదుర్కొన్న దినేశ్ చండిమాల్ మరో రెండు టెస్టులకు దూరం కానున్నాడు. అదే విధంగా 4 వన్డేల్లోనూ అతడిపై నిషేధం కొనసాగుతుంది. ఐసీసీ రిఫరీ ముందు నిరసన వ్యక్తం చేసిన చీఫ్ కోచ్ హతుర సింగ, మేనేజర్ గురు సిన్హాలపై రెండేసి టెస్టులు, 4 వన్డేల్లో నిషేధం విధించింది.